Covid - 19 : గడిచిన 24 గంటల్లో 1590 కోవిడ్ కేసులు

Update: 2023-03-25 06:45 GMT

దేశంలో గడిచిన 24 గంటల్లో 1,590 కోవిడ్ కేసులు నమోదయ్యాయి, ఇది 146 రోజులలో అత్యధికం అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. శుక్రవారం 1,590 కొత్త కేసులు నమోదు కావడంతో భారతదేశంలో యాక్టివ్ కరోనావైరస్ కేసుల సంఖ్య 8,601కి పెరిగింది. 146 రోజుల్లో నమోదైన అత్యధిక కేసులు ఇదేనని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.


దేశంలో గత కొన్ని రోజులుగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి, ఇది ఆరోగ్య శాఖను ఆందోళనకు గురిచేస్తోందని అధికారులు తెలిపారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, గత 24 గంటల్లో మరో ఆరు కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, మహారాష్ట్ర నుంచి ముగ్గురు, కర్ణాటక, రాజస్థాన్, ఉత్తరాఖండ్ నుంచి ఒక్కొక్కరు మరణించారు. గడిచిన 24 గంటల్లో 910 మంది కోలుకున్నారని చెప్పారు. దీంతో వైరల్ ఇన్‌ఫెక్షన్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,62,832కి చేరుకుంది. రికవరీ రేటు 98.79 శాతంగా ఉంది. కేసు మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది.

రోజువారీ పాజిటివిటీ రేటు, వీక్లీ పాజిటివిటీ రేటు వరుసగా 1.33 శాతం మరియు 1.23 శాతంగా ఉన్నాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, దేశంలో ఇప్పటివరకు 220.65 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్‌లు ఇవ్వబడ్డాయి. గత 24 గంటల్లో మొత్తం 1,19,560 కోవిడ్ పరీక్షలు నిర్వహించగా, ఇప్పటివరకు 92.08 కోట్ల పరీక్షలు జరిగాయి.

రోజువారీగా.. కోవిడ్-19 కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో, Omicron యొక్క XBB.1.16 సబ్‌వేరియంట్ దేశంలో ప్రబలమైన వైరస్ జాతి కావచ్చని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది, అయితే ఆసుపత్రిలో చేరడం లేదా మరణాల రేటులో ఎటువంటి పెరుగుదల లేదని తెలిపింది. దేశంలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ పరిస్థితిని సమీక్షించడానికి, ప్రజారోగ్య సంసిద్ధతను సమీక్షించడానికి ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.

Similar News