Karnataka: మైక్ లాక్కున్న సీఎం

మఠాధిపతి నుంచి మైక్‌ను లాక్కున్న కర్ణాటక సీఎం; కర్ణాటక పౌరసరఫరాల శాఖపై విమర్శలు చేసిన స్వామిజీ; అలర్ట్ అయి మైక్ లాక్కున్న సీఎం బసవరాజ్ బొమ్మై;

Update: 2023-01-28 07:13 GMT

ఓ మఠాధిపతి నుంచి కర్ణాటక సీఎం మైక్‌ను లాక్కున్న సంఘటన స్థానికంగా కలకలం రేపింది. బెంగళూరు మహదేవపురలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈశ్వరానందపురి స్వామి వద్ద నుంచి మైక్‌ను లాక్కున్నారు సీఎం బసవరాజ్ సోమప్ప బొమ్మై. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. పౌరసరఫరాల శాఖపై స్వామిజీ విమర్శలు చేశారు. నియోజక వర్గంలో వరదలు, మౌలిక సదుపాయాలు లేకపోవడాన్ని ప్రస్తావించారు. రాజకీయ నాయకులే ఈ ఇబ్బందులకు కారణమని ఆరోపించారు. దీంతో వెంటనే అలర్ట్ అయిన సీఎం... స్వామిజీ దగ్గర నుంచి మైక్ లాక్కున్నారు. తాను హామీలు ఇచ్చేవాడిని కానని, కానీ సమస్యల పరిష్కారానికి నిధులు విడుదల చేసినట్లు సీఎం స్పష్టం చేశారు.

Tags:    

Similar News