Omicron India: ఇండియాలో పది దాటిన ఒమిక్రాన్ వేరియంట్ కేసులు..
Omicron India: ఒమిక్రాన్ వేరియంట్ భారత్ లోనూ పంజా విసురుతోంది.
Omicron India: ఒమిక్రాన్ వేరియంట్ భారత్ లోనూ పంజా విసురుతోంది. మహారాష్ట్రలో కొత్తగా ఏడుగురిలో ఈ వేరియంట్ ను గుర్తించారు. దీంతో భారత్ లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 12కు పెరిగింది. తాజాగా గుర్తించిన ఏడు కేసులతో మహారాష్ట్రలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 8కి పెరిగింది. కర్ణాటకలో రెండు కేసులు, ఢిల్లీ, గుజరాత్ లో ఒక్కో కేసు నమోదైంది. రోజురోజుకు ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది.