దేశ రాజధాని ఢిల్లీలో ఇద్దరు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. వారు నిషేధిత ఉగ్రవాద సంస్థ ఖలిస్థాన్ జిందాబాద్ ఫోర్స్ కు చెందిన సభ్యులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిద్దరు స్వాతంత్య్రదినోత్సవం రోజున పంజాబ్లోని మోగా డిప్యూటీ కమిషనర్ కార్యాలయంపై ఖలిస్థాన్ జెండాను ఎగరేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.