Narendra Modi : పెట్రో ధరలపై స్పందించిన ప్రధాని మోదీ..!

Narendra Modi : దేశంలో పెట్రో ధరల పెరుగుదలపై మొదటిసారి ప్రధాని మోదీ స్పందించారు. పెట్రో ధరల పెరుగుదలకు కొన్ని రాష్ట్రాల తీరు కూడా కారణమన్నారు.

Update: 2022-04-27 09:15 GMT

Narendra Modi : దేశంలో పెట్రో ధరల పెరుగుదలపై మొదటిసారి ప్రధాని మోదీ స్పందించారు. పెట్రో ధరల పెరుగుదలకు కొన్ని రాష్ట్రాల తీరు కూడా కారణమన్నారు. తెలంగాణ, ఏపీతో సహా బెంగాల్‌, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలు.. పన్నులను తగ్గించకపోవడంతో ఆయా రాష్ట్రాల ప్రజలపై పెట్రో ధరల భారం పెరిగిందన్నారు. గత నవంబర్‌లోనే ఇంధనంపై రాష్ట్రాల పన్నులను తగ్గించాలని కేంద్రం విజ్ఞప్తి చేసినా.. కొన్ని రాష్ట్రాలే అమలు చేశాయన్నారు. ఈ ఆరేడు నెలల్లో కొన్ని వేల కోట్ల రుపాయలు మిగతా రాష్ట్రాలు లబ్ధిపొందాయని ఎద్దేవా చేశారు. ఇకనైనా సమైఖ్య స్ఫూర్తితో రాష్ట్రాలన్నీ పన్నులను తగ్గించి ప్రజలకు ఊరట కల్పించాలని పిలుపిచ్చారు. 

Tags:    

Similar News