సారొస్తున్నారు.. న్యూ ఇయర్లో పార్టీ షురూ..
రజనీ ప్రత్యక్ష రాజకీయాల్లో రావడం కన్ఫామ్ అయిందని ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు;
ఎన్నాళ్లో వేచిన ఉదయం ఈ రోజే ఎదురవుతుంటే అని తమిళ తంబీలతో పాటు యావత్ సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు పాట పాడుకుంటున్నారు. జనవరిలో కొత్త పార్టీ పెట్టనున్నట్లు తలైవా గురువారం ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు డిసెంబర్ 31న వెల్లడిస్తానని ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని, గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు.
కరోనావైరస్ మహమ్మారి కారణంగా తన ప్రణాళికలు ప్రభావితమయ్యాయని, ప్రజల పట్ల నిర్లక్ష్యంగా ఉండటానికి ఇష్టపడలేదని ఆయన మీడియాతో అన్నారు.తమిళనాడును మార్చాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి, సూపర్ స్టార్ "ప్రజల కోసం సాధ్యమైనంతవరకు శక్తి మేరకు పని చేస్తా.. మనం చేయకపోతే మార్పు ఎప్పటికీ జరగదు" అని ఆయన అన్నారు.రాజకీయాల్లో తన విజయం ప్రజల విజయమేనని అన్నారు. "ఇదంతా తమిళనాడు ప్రజలపై ఆధారపడి ఉంటుంది. నేను రాజకీయాల్లోకి ప్రవేశించినప్పుడు గెలిస్తే అది ప్రజల విజయం అవుతుంది" అని అన్నారు.
తమిళనాడును అన్ని రకాలుగా అభివృద్ధి బాటలో పయనించేలా చేస్తా.. సమూలంగా మార్చేస్తానని అంటున్నారు. తనకు మద్దతుగా నిలుస్తున్నవారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. దీంతో రజనీ ప్రత్యక్ష రాజకీయాల్లో రావడం కన్ఫామ్ అయిందని ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రజనీ మక్కల్ మండ్రం ముఖ్య నిర్వాహకులు, జిల్లాల కార్యదర్శులతో సోమవారం రజనీ భేటీ అయిన విషయం తెలిసిందే.
చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణ మండపం నిర్ణయం ప్రకటిస్తాను అని రజనీ వెల్లడించారు. ఈ క్రమంలో నేడు పార్టీ ప్రారంభం గురించి ప్రకటన విడుదల చేయడం గమనార్హం. ఇక సినీ రంగం నుంచి రాజకీయాల్లో ప్రవేశించి ముఖ్యమంత్రులుగా తమదైన ముద్ర వేసిన కరుణానిధి, జయలలిత మరణం తర్వాత తమిళనాట రాజకీయాలు అస్తవ్యస్థంగా మారిన విషయం తెలిసిందే.
రజనీకాంత్ మాట్లాడుతూ, "మేము ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధిస్తాము, నిజాయితీ, పారదర్శక, అవినీతి రహిత, ఆధ్యాత్మిక రాజకీయాలను తీసుకు వస్తాము అని ఆయన అన్నారు. ఒక అద్భుతం ఖచ్చితంగా జరుగుతుంది. అని రజనీ అన్నారు."
ఆయన 2017 డిసెంబర్ 31 న కూడా రాజకీయాల్లోకి ప్రవేశించడం గురించి ప్రకటన చేశారు. రజని సోమవారం తన ఆర్ఎంఎం జిల్లా కార్యదర్శులను కలిశారు, ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు త్వరలోనే దీనిపై ఒక ప్రకటన చేస్తానని చెప్పారు. రజని తన రాజకీయ శ్రేణిని ఆధ్యాత్మికం అని పిలిచారు, ఇది మతం, అవినీతి మరియు ప్రజల సంక్షేమం కోసం మించినది. రజినీ తన మద్దతుదారులను రాష్ట్రంలోని ప్రతి వీధికి వెళ్లి తన
1996 లో రజిని బహిరంగంగా డిఎంకెకు మద్దతు ఇచ్చారు. అప్పుడు "జయలలిత నుండి తమిళనాడును రక్షించాలని" పిలుపునిచ్చారు. రజని వ్యక్తిగతంగా వెళ్లి డిఎంకె పితృస్వామ్య కరుణానిధిని కలుసుకుని ఆయనఆశీర్వాదం తీసుకున్నారు. ఎ.ఐ.ఎ.డి.ఎం.కెకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, సినీ రంగంలో చాలా మందిలాగే రజినీ కూడా డిఎంకెలో చాలా మందికి దగ్గరగా ఉన్నారు. రజినికి స్టాలిన్తో మంచి సంబంధం ఉందని చెబుతారు.
చాలా మంది ఆర్ఎస్ఎస్, బిజెపి నాయకులు మోహన్ భగవత్, అమిత్ షా, పిఎం మోడీలతో సన్నిహిత సంబంధాలు ఉన్న సూపర్ స్టార్ తన రాజకీయ ప్రవేశాన్ని వాయిదా వేస్తే వచ్చారని అనుమానిస్తున్నారు.
ఈ క్రమంలో నటులు కమల్ హాసన్, రజనీకాంత్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనే డిమాండ్లు మరింత ఉధృతమయ్యాయి. ఈ క్రమంలోనే కమల్ ఇప్పటికే మక్కల్ నీది మయ్యం పేరిట పార్టీ స్థాపించారు. అనేక పరిణామాల అనంతరం రజనీ రాజకీయ రంగ ప్రవేశం షురూ అయింది.