మహారాష్ట్రలో షిరిడి సాయిబాబా ఆలయం మూసివేత..!

మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో షిర్డీలోని సాయి బాబా ఆలయాన్ని మూసివేయాలని శ్రీ సాయిబాబా సంస్థ ట్రస్ట్ (SSST) నిర్ణయించింది.

Update: 2021-04-05 15:12 GMT

మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో షిర్డీలోని సాయి బాబా ఆలయాన్ని ఈ రోజు రాత్రి 8 గంటలకు, అంటే 2021 ఏప్రిల్ 5 నుండి మూసివేయాలని శ్రీ సాయిబాబా సంస్థ ట్రస్ట్ (SSST) నిర్ణయించింది. ఈ ఆలయం 2021 ఏప్రిల్ 30 వరకు మూసివేయబడుతుంది. సాయి ఆలయంతో పాటుగా ప్రసాదాలయ, భక్త నివాస్ కూడా భక్తుల కోసం మూసివేయబడతాయి. కాగా సాయిబాబుకు ఆలయ పూజారులచే రోజువారి పూజలు జరుగుతాయి.

Tags:    

Similar News