తమిళనాడులోని కాంచీపురంలోని ఓ బాణసంచా యూనిట్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం జరిగింది. బాణసంచా యూనిట్లో మంటలు చెలరేగడంతో ఎనిమిది మంది మరణించగా, 19 మంది కాలిన గాయాలకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పుతున్నారు. గాయాలకు గురైన 19 మందిలో 11 మంది కాంచీపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, మరో ఎనిమిది మందిని ఇతర ఆసుపత్రులకు రిఫర్ చేశారు. మరింత సమాచారం తెలియాల్సిఉంది.