ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా.. క్వారంటైన్లో సీఎం
ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కరోనా సోకింది. ఎమ్మెల్యేలు ఇటీవల సీఎంని కలిశారు. దీంతో సీఎం క్వారంటైన్లోకి వెళ్లారు.;
దేశంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇక పంజాబ్లో కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తోంది. నిత్యం పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ కరోనా మహమ్మారి ప్రజా ప్రతినిధులను కూడా వదలటం లేదు. తాజాగా ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కరోనా సోకింది. పంజాబ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిర్మల్ సింగ్, కుల్బీర్ సింగ్లకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఎమ్మెల్యేలు ఇటీవల విధాన సభలో సీఎంని కలిశారు.
దీంతో పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ క్వారంటైన్లోకి వెళ్లారు. గవర్నమెంట్ ప్రొటోకాల్, వైద్యుల సలహా ప్రకారం ఏడు రోజుల పాటు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని అమరీందర్ సింగ్ నిర్ణయించుకున్నారని అధికారులు తెలిపారు. తాజాగా ఈ ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిపి ఇప్పటి వరకు పంజాబ్ రాష్ట్రంలో కరోనా బారినపడిన శాసనసభ్యుల సంఖ్య 32కి చేరింది.