బెంగాల్ లో కేంద్ర మంత్రి కాన్వాయ్ పై దాడి.. !
వెస్ట్ మిడ్నాపూర్ పంచ్ క్కుడిలో తన కాన్వాయ్ పై రాళ్లు, కర్రలతో పలువురు చేసిన దాడిలో వ్యక్తిగత సిబ్బందికి గాయాలయ్యాయని మురళీధరన్ ట్వీట్ చేశారు.;
బెంగాల్ లో కేంద్ర మంత్రి వీ మురళీధరన్ కాన్వాయ్ పై స్థానికులు దాడి చేశారు. వెస్ట్ మిడ్నాపూర్ పంచ్ క్కుడిలో తన కాన్వాయ్ పై రాళ్లు, కర్రలతో పలువురు చేసిన దాడిలో వ్యక్తిగత సిబ్బందికి గాయాలయ్యాయని మురళీధరన్ ట్వీట్ చేశారు. టీఎంసీ కార్యకర్తలే దాడి చేసినట్లు కేంద్రమంత్రి ఆరోపించారు. దాడిలో మంత్రి కారు ధ్వంసమైంది. ఈ నేపథ్యంలో తన పర్యటనను మురళీధరన్ రద్దు చేసుకున్నారు.