Venkaiah Naidu : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు మరోసారి కరోనా

Venkaiah Naidu : ధర్డ్‌వేవ్‌లో భాగంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ప్రతిరోజు లక్షల్లో కేసులు నమోదువుతున్నాయి.

Update: 2022-01-23 12:00 GMT

Venkaiah Naidu : Venkaiah Naidu : ధర్డ్‌వేవ్‌లో భాగంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ప్రతిరోజు లక్షల్లో కేసులు నమోదువుతున్నాయి. ఈ మధ్యకాలంలో చాలామంది ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. తాజాగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు మరోసారి కరోనా సోకింది. ఈ విషయాన్ని వెంకయ్య ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల తనని కలిసిన వారందరూ కరోనా పరీక్ష చేయించుకోవాలని సూచించారు. వెంకయ్యకి కరోనా సోకడంతో ఆయన పాల్గొనాల్సిన వివిధ కార్యక్రమాలను రద్దుచేస్తున్నట్లు ఉపరాష్ట్రపతి భవన్ తెలిపింది. కాగా 2020 సెప్టెంబర్‌లో తొలిసారిగా ఉపరాష్ట్రపతికి కరోనా సోకింది.


Tags:    

Similar News