Shashi Tharoor: ఇన్నేళ్లకు విముక్తి: భార్య మరణంపై తీర్పు తర్వాత మాజీ మంత్రి శశి థరూర్
కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్పై అభియోగాలు మోపడానికి కోర్టు నిరాకరించడంతో పాటు అతడిపై ఉన్న అన్ని ఆరోపణలను కొట్టి వేసింది.
Shashi Tharoor: కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్పై అభియోగాలు మోపడానికి కోర్టు నిరాకరించడంతో పాటు అతడిపై ఉన్న అన్ని ఆరోపణలను కొట్టి వేసింది. 2014 లో ఆయన భార్య సునంద పుష్కర్ మరణానికి సంబంధించిన ఆరోపణలపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్పై ఢిల్లీ కోర్టు ఈరోజు తీర్పునిచ్చింది.
సునంద పుష్కర్ (51) జనవరి 17, 2014 రాత్రి ఢిల్లీలోని ఒక లగ్జరీ హోటల్ సూట్లో శవమై కనిపించింది. ఎంపీ ఇంటిని పునర్నిర్మించినందున ఆమె హోటల్లో బస చేసింది. అక్కడ ఆమె శవమై కనిపించడం వివాదాలకు దారి తీసింది. భర్త శశి థరూర్పై నేరం మోపుతూ అతడిని అరెస్ట్ చేశారు.
సునంద పుష్కర్ మరణం ఆత్మహత్య లేదా హత్య కాదని సాక్ష్యాధారాలు చూపించాలని కాంగ్రెస్ నాయకుడు కోర్టును ఆశ్రయించారు. మరణం ఒక ప్రమాదంగా పరిగణించబడాలి. ఆమె మరణించే సమయంలో పుష్కర్ వివిధ వ్యాధులతో బాధపడుతున్నారు అని అన్నారు.
థరూర్ (65) పై అభియోగాలు మోపడానికి కోర్టు ఈ రోజు నిరాకరించింది. మాజీ కేంద్ర మంత్రిని అన్ని ఆరోపణల నుండి తొలగించింది. కోర్టుకు చాలా కృతజ్ఞతలు.. ఏడున్నర సంవత్సరాలకాలం నేను చాలా మానసిక వేదన అనుభవించాను. ఇప్పటికి విముక్తి లభించింది అని థరూర్ అన్నారు.
కొన్నేళ్లపాటు పోలీసుల విచారణ తర్వాత, ప్రాసిక్యూషన్ శ్రీమతి పుష్కర్ మరణానికి కారణాన్ని నిర్ధారించడంలో విఫలమైందని కోర్టుకు తెలిపింది. మిస్టర్ థరూర్ మరియు శ్రీమతి పుష్కర్ 2014 లో వివాహం చేసుకున్నారు. ఆమె మరణం రాజకీయ వర్గాలలో అనేక ఊహాగానాలకు కారణమైంది. ప్రత్యేకించి ఆమె చివరి ట్వీట్లలో ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లు సూచించబడ్డాయి. తన భర్త ఒక పాకిస్తానీ జర్నలిస్ట్తో ఎఫైర్ ఉన్నట్లు ఆరోపించారు.
సునంద పుష్కర్పై విషప్రయోగం జరిగిందని పోలీసులు మొదట ప్రకటించారు. కానీ ఒక సంవత్సరం తరువాత, వారు ఏ అనుమానితుడి పేరు చెప్పకుండా ఒక హత్య కేసు నమోదు చేశారు.