ఏపీ హైకోర్టులో ఉద్యోగాలు.. అప్లైకి ఆఖరు తేదీ..
ఈ పోస్టులను స్క్రీనింగ్ టెస్ట్ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) ద్వారా ఎంపిక చేస్తారు.
అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (హైకోర్ట్ ఆఫ్ ఏపీ) 55 సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 55 పోస్టుల్లో 18 పోస్టులు మహిళలకు కేటాయించారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. జనవరి 2, 2021 దరఖాస్తుకు చివరితేదీ. ఈ పోస్టులను స్క్రీనింగ్ టెస్ట్ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) ద్వారా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు http://hc.ap.nic.in/ వెబ్సైట్ చూడొచ్చు.
ముఖ్య సమాచారం:
సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్)
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.800
వయసు: డిసెంబర్ 1,2020 నాటికి 35 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం
దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 02, 2021
వెబ్సైట్: http://hc.ap.nic.in/