తెలంగాణ యూనివర్సిటీలో రిజిస్ట్రార్ల వివాదం ముదురుతోంది. పాలక మండలి నియమించిన రిజిస్ట్రార్ను విసీ వ్యతిరేకిస్తుండగా, వీసీ నియమించిన రిజిస్ట్రార్ను పాలక మండలి తిరస్కరిస్తోంది. ఇలా గడిచిన 20 నెలల్లో ఆరుగురు రిజిస్ట్రార్లు మారడం కలకలం రేపుతుంది. ఉన్నత విద్యాశాఖ కమీషనర్ నవీన్ మిట్టల్, యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ రవీందర్ గుప్తా మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. రిజిస్ట్రార్ల రాజకీయాలతో నలిగిపోతున్నా మంటున్నారు విద్యార్ధులు.