తెలంగాణలో కొత్తగా 2795 కరోనా పాజిటివ్ కేసులు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24గంటల్లో 2,795 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.;
తెలంగాణలో కరోనా స్వైర విహారం చేస్తోంది. నిత్యం పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ప్రతి రోజు వేలల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజగా రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24గంటల్లో 2,795 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే 449 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,14,483కు చేరింది.
కరోనా మహమ్మారి బారిన పడి ఒక్కరోజే 8 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం మృతుల సంఖ్య 788కి చేరింది. తాజాగా 872 మంది వైరస్ నుంచి కోలుకొని డిశ్చారి అయ్యారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 86,095 మంది వైరస్ కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 26,700 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 27,600 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారు.