టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డీజీపీకి లేఖ రాశారు. మాజీ మంత్రి జవహర్ను పోలీసులు అవమానించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతకు రోల్ మోడల్స్గా నిలవాల్సిన పోలీసులు.. చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారంటూ డీజీపీకి లెటర్ రాశారు. లోకేష్ పాదయాత్రలో చిత్తూరు జిల్లా నగరి ఎస్ఐ మాట్లాడిన భాష అనాగరికులు కూడా తలదించుకునేలా ఉందంటూ పేర్కొన్నారు.
చంద్రబాబు పర్యటనలో ఉన్న జవహర్ను అరెస్ట్ చేసి నేలపై కూర్చోబెట్టి హింసించడం ఎంతవరక కరెక్ట్ అంటూ ప్రశ్నించారు. మాజీ మంత్రి జవహార్.. దళితుడని తెలిసే కావాలని కులవివక్ష చూపారని ఆగ్రహించారు. ఇక చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న నగరి సీఐపై విచారణ చేయాలని కోరారు. మాజీ మంత్రి జవహర్ను అవమానించిన రామచంద్రాపురం పోలీసులపై.. ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ సెక్షన్-3 ప్రకారం కేసు నమోదుచేయాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.