గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నేషనల్ తైక్వాండో చాంపియన్ షిప్ పోటీలు ప్రారంభించారు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో తైక్వాండో పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీలను తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ ఆంజనేయ గౌడ్, తెలంగాణ ఇరిగేషన్ కార్పొరేషన్ ఛైర్మన్ వేణుగోపాలాచారి ప్రారంభించారు. తెలంగాణ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో పోటీలు జరుగుతున్నాయి. తైక్వాండో పోటీలకు టీవీ5 మీడియా పార్టనర్గా వ్యవహరిస్తోంది. ఈ పోటీలకు వివిధ రాష్ట్రాల క్రీడాకారులు హాజరయ్యారు.