TS : విషమంగానే మెడికో ప్రీతి ఆరోగ్యం
ప్రీతిని రక్షించేందుకు నిమ్స్ వైద్యులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. న్యూరాలజీ, జనరల్ ఫిజీషియన్, కార్డియాజిస్టుతో కూడిన ఐదుగురు వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తోంది;
మెడికో ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేసి నాలుగు రోజులు గడుస్తున్నా.. ఆమె పరిస్థితి కాస్త కూడా మెరుగుపడినట్లు కన్పించడం లేదు. ఇంకా వెంటిలేటర్పై ఉంచి ఎక్మో సపోర్టుతోనే చికిత్స అందిస్తున్నారు. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో నిమ్స్లో వైద్యం కొనసాగుతుంది. ఇక కూతరు పరిస్థితిని చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమకు కూతురుని రక్షించాలని వైద్యులను వేడుకుంటున్నారు. మరోవైపు ప్రీతి ఆత్మహత్యాయత్నంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కేసు నమోదు చేసింది.
ప్రీతిని రక్షించేందుకు నిమ్స్ వైద్యులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. న్యూరాలజీ, జనరల్ ఫిజీషియన్, కార్డియాజిస్టుతో కూడిన ఐదుగురు వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తోంది. ప్రీతి మత్తు ఇంజెక్షన్ తీసుకుంది. దీని ప్రభావం శరీరంలోని భాగాలపై విపరీతంగా ఉంటుందని వైద్యులు తెలిపారు. ముఖ్యంగా బ్రెయిన్ పై మత్తు ఇంజెక్షెన్ ప్రభావం ఎక్కువగా పడుతుందన్నారు.
మరోవైపు గిరిజన, ప్రజా సంఘాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. బాధితురాలుకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిమ్స్ ఆస్పత్రి దగ్గర ఆందోళన చేస్తూనే ఉన్నారు.. అటు నిమ్స్ ఆస్పత్రికి వెళ్లిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ప్రీతి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం వెంటనుఏ స్పందించి బాధితురాలికి న్యాయం చేయాలన్నారు.
ప్రీతి ఆరోగ్యంపై మంత్రి హరీష్ రావు ఆరా తీశారు. నిన్న నిమ్స్ ఆస్పత్రికి వెళ్లిన హరీష్.. వైద్యుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పిన హరీష్ రావు.. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.