వ్యవసాయ శాఖ మంత్రికి కరోనా పాజిటివ్
జార్ఖాండ్ వ్యవసాయ శాఖ మంత్రికి కరోనా సోకింది. ఈ విషయాన్ని మంత్రి స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్లో ధ్రువీకరించారు.
దేశంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు ఎవరినీ ఈ కరోనా మహమ్మారి వదలడం లేదు. తాజాగా జార్ఖాండ్ వ్యవసాయ శాఖ మంత్రికి కరోనా సోకింది. మంత్రి బాదల్ పత్రలేఖ్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని మంత్రి స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్లో ధ్రువీకరించారు. తనకు సన్నిహితులుగా ఉన్న వారు కూడా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, సురక్షితంగా ఇంటిలోనే ఉండాలని ఆయన కోరారు. శనివారం రాత్రి తనకు వైద్య పరీక్షల రిపోర్ట్ వచ్చిందని ఆయన తెలిపారు.