ఏపీలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. కొత్తగా 9927 కేసులు

Update: 2020-08-25 14:45 GMT

ఏపీలో కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9927 కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ తెలిపింది. అటు, కరోనా మరణాలు 92 సంభవించాయి. తాజాగా నమోదైన కేసులతో మృతుల సంఖ్య 3460కి చేరింది. అటు, రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 368744కు చేరగా.. 275352 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 89932 మంది చికిత్స పొందుతున్నారు. 

Tags:    

Similar News