తమిళనాడులో తగ్గని కరోనా వ్యాప్తి.. కొత్తగా 5,951 కేసులు

తమిళనాడులో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి.

Update: 2020-08-25 15:35 GMT

తమిళనాడులో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో తమిళనాడులో కొత్తగా 5,951 కరోనా కేసులు నమోదయ్యాయి. అటు, కరోనా మరణాలు కూడా భారీగా నమోదయ్యాయి. ఒక్కరోజే 107 మంది కరోనాతో మరణించారని తమిళనాడు ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3,91,303కి చేరింది. ఇప్పటివరకూ కరోనాతో 6,721 మంది మృతి చెందారు. కాగా ప్రస్తుతం 52,128 ఇంకా మంది చికిత్స పొందుతున్నారు. 

Tags:    

Similar News