Space Station : 41 ఏండ్ల తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి భారతీయుడు.. తల్లి ఆనందం
సోవియట్ యూనియన్ కు చెందిన సూయజ్ టీ-11 వ్యోమనౌకలో భారత వ్యోమగామి రాకేశశర్మ తొలిసారిగా 1984లో అంతరిక్షంలోకి వెళ్లి 8 రోజులపాటు ఉండి తిరిగొచ్చారు. తాజా ప్రయోగం 41 ఏండ్ల తర్వాత రోదసిలోకి వెళ్తున్న రెండో భారతీయుడిగా శుభాంశు శుక్లా రికార్డు సృష్టించారు. ఐఎస్ఎస్లోకి కాలిడిన తొలి భారతీ యుడిగా శుభాంశు కొత్త చరిత్ర తన పేరిట లిఖించుకున్నారు. డాకింగ్ పూర్తయిన తర్వాత ఐఏఎఫ్ గ్రూప్ కెప్టెన్, వ్యోమగామి శుభాంశు శుక్లా తల్లి ఆశా శుక్లా మీడియాతో మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశారు. 'డాకింగ్ విజయ వంతంగా జరగడం చూశాను. ఇది చాలా గర్వకారణం. ఇది అందరికీ మంచిది. మేము చాలా సంతోషంగా ఉన్నాము. మేము ప్రతిరోజూ ప్రార్థించాము. వారు తమ కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించి సురక్షితంగా భూమికి తిరిగి రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నాము. ఈ ఘనత నా బిడ్డకు, అతని కృషికి, అంకితభావానికి దక్కుతుంది. ఇవే అతన్ని ఈ స్థాయికి తీసుకెళ్లాయి' అని ఆమె కళ్లలో నీళ్లు తిరుగుతుండగా చెప్పారు.