BrahMos Missiles : 800 కి.మీ. రేంజ్ బ్రహ్మోస్ క్షిపణుల పరీక్షలు..వచ్చే ఏడాదే సేనల బలం పెంచనున్న మిస్సైల్స్.

Update: 2025-10-21 05:15 GMT

BrahMos Missiles : పాకిస్తాన్‌పై జరిగిన ఆపరేషన్ సింధూర్ లో తన సామర్థ్యాన్ని నిరూపించుకున్న బ్రహ్మోస్ క్షిపణి అధునాతన వెర్షన్ త్వరలో భారతీయ సైన్యంలో చేరనుంది. 800 కిలోమీటర్ల దూరం ప్రయాణించగల బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్స్ ప్రస్తుతం పరీక్షించబడుతున్నాయి. 2027 నాటికి ఈ శక్తివంతమైన క్షిపణులు సైన్యంలో మోహరించబడతాయి. వీటితో పాటు 200 కిలోమీటర్ల దూరం ప్రయాణించి లక్ష్యాలను ఛేదించగల ఎయిర్-టు-ఎయిర్ అస్త్ర క్షిపణులు కూడా మరో సంవత్సరంలో మోహరింపునకు సిద్ధంగా ఉంటాయి.

ప్రస్తుతం ఉన్న బ్రహ్మోస్ మిస్సైల్ 450 కిలోమీటర్ల రేంజ్ కలిగి ఉంది. దీని వేగం సుమారు 2.8 మ్యాక్. అంటే, ఇవి దాదాపు 4,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి శత్రువులను ధ్వంసం చేయగలవు. ఇప్పుడు ఈ క్షిపణిని మరింత అభివృద్ధి చేశారు.

కొత్త బ్రహ్మోస్ క్షిపణి ప్రయాణ సామర్థ్యం 800 కిలోమీటర్లకు పెరిగింది. దాని రామ్‌జెట్ ఇంజిన్‌లో మార్పులు చేశారు. దానికి అమర్చిన నావిగేషన్ సిస్టమ్స్ కలయిక ఎలా పనిచేస్తుందో ప్రస్తుతం పరీక్షిస్తున్నారు. ఇది విజయవంతమైతే, కొత్త బ్రహ్మోస్ క్షిపణి మరింత భయంకరమైన ఆయుధంగా మారుతుంది. ఇది భారత సైన్యానికి భారీ బలాన్ని చేకూరుస్తుంది.

భారత నౌకాదళం అవసరాలకు తగ్గట్టుగా బ్రహ్మోస్ క్షిపణిని అప్‌గ్రేడ్ చేసే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే అభివృద్ధి చేయబడిన 800 కిలోమీటర్ల రేంజ్ బ్రహ్మోస్ క్షిపణి సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసి నౌకాదళానికి అనుకూలంగా నిర్మించడం సాధ్యమే. ఇది నౌకాదళం రక్షణ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది.

భారతదేశం స్వదేశీ నిర్మిత అస్త్ర క్షిపణులను కూడా మరింత అప్‌గ్రేడ్ చేస్తున్నారు. ప్రస్తుతం 160 కిలోమీటర్లు ఉన్న ఈ క్షిపణి రేంజ్ 200 కిలోమీటర్లకు పెంచడానికి డిఆర్‌డిఓ ప్రయత్నిస్తోంది. అస్త్ర మార్క్-2 రకానికి చెందిన 700 క్షిపణులను భారతీయ వాయుసేన కలిగి ఉంటుంది. ఇదే సమయంలో, 350 కిలోమీటర్ల శ్రేణి గల అస్త్ర మార్క్-3 క్షిపణి అభివృద్ధి జరుగుతోంది. ఇవి మరో మూడు సంవత్సరాలలో మోహరించబడవచ్చు. ఈ క్షిపణులు భారత రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తాయి.

Tags:    

Similar News