భారత్లో కరోనా విజృంభణకు బ్రేకులు పడడం లేదు. రోజు రోజుకూ వైరస్ విజృంభిస్తూనే ఉంది.. గత 24 గంటల్లో 85,362 మందికి కరోనా పాజిటివ్ నిర్ధరారణ అయ్యింది. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 59,03,933కి చేరింది. కరోన నుంచి 48,49,585 మంది పూర్తిగా కోలుకున్నారు.. ప్రస్తుతం దేశంలో 9,60,696 యాక్టివ్ కేసులు ఉన్నాయి...
ఇక భారత్లో కరోనా మరోణాల సంఖ్య ఆందోళన పెంచుతోంది. గడిచిన 24 గంటల్లో కరోనా కరాణంగా 1,089 మంది మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 93,379కి పెరిగింది. ఇక దేశవ్యాప్తంగా రికవరీ రేటు 82.14 శాతంగా ఉండగా.. మరణాల రేటు 1.58 శాతంగా ఉంది.