Actres Kasturi : బెయిల్ మంజూరుతో కస్తూరికి ఊరట.. జైలు బయట సన్నిహితుల కోలాహలం
తమిళనాడు పుళల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న నటి కస్తూరికి ఊరట దక్కింది. కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆమె రిలీజ్ కానున్నారు. జైలు బయట ఆమె సన్నిహితుల సందడి కనిపించింది. తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టైన నటి కస్తూరి శంకర్ కి కోర్టులో ఊరట లభించింది. ఆమెకు ఎగ్మూర్ కోర్టు సాయంత్రం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఆమె ముందస్తు బెయిల్ను మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం తిరస్కరించడంతో హైదరాబాద్లో కస్తూరిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి అమెను చెన్నైకు తీసుకొచ్చిన తమిళనాడు పోలీసులు.. కోర్టులో హాజరిపరచగా 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ప్రస్తుతం పుళల్ జైలులో కస్తూరి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆమెకు నవంబరు 29 వరకు కస్టడీ ఉండగా.. బెయిల్ పై ఊరట పొందారు.