Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరుణ్ రామచంద్ర పిళ్లైకి బెయిల్
సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైకి ఢిల్లీ హైకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కవిత బినామీగా ఆరోపణలు ఎదురుకున్న రామచంద్ర పిళ్ళైను మార్చి 6న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. రాబిన్ డిస్టిలరీస్ పేరుతో వ్యాపారం చేసిన రాంచంద్ర పిళ్లై.. ఢిల్లీ పెద్దలకు పెద్ద మొత్తంలో ముడుపులు చెల్లించినట్లు ఈడీ ఆరోపించింది. ఇండో స్పిరిట్తో పాటు కొందరి నుంచి డబ్బులు వసూలు చేసినట్లుగా ఆరోపణలు వినిపించాయి. ఇక ఇప్పటికే ఈ కేసులో ఎంపీ సంజయ్ సింగ్, మనీష్ సిసోడియా, ఎమ్మెల్సీ కవిత, విజయ్ నాయర్, సమీర్ మహేంద్రు, ఆప్ వాలంటీర్ చన్ప్రీత్ సింగ్ లకు బెయిల్ లభించింది.