Arvind Kejriwal: దేశ రాజకీయాలను ఆమ్ ఆద్మీ మార్చేస్తోంది: కేజ్రీవాల్
Arvind Kejriwal: దేశ రాజకీయాలను ఆమ్ ఆద్మీ మార్చేస్తోందన్నారు ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.
Arvind Kejriwal: దేశ రాజకీయాలను ఆమ్ ఆద్మీ మార్చేస్తోందన్నారు ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. ఒకరినొకరు ప్రేమించుకునే.. ఆకలిలేని.. అక్కాచెల్లెల్లు సురక్షితంగా ఉండే.. పేదధనిక బిడ్డలు ఒకే దగ్గర చదువుకునే భారత్ను ఆవిష్కరిస్తామన్నారు. ఢిల్లీలో మొదట ప్రారంభమైన ఈ స్వాతంత్ర్యం ఇపుడు పంజాబ్కు చేరిందని, తర్వాత దేశమంతా పాకుతుందన్న కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. సామాన్య మానవుడికి పోటీ చేసే అవకాశం కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారని పంజాబ్ సీఎం చన్నీ, సిద్దూతో సహా బడా నేతల ఓటములు చాటి చెబుతున్నాయన్నారు.