ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ప్రశ్నించేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా ఆరోసారి సమన్లు జారీ చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ కూడా అయిన కేజ్రీవాల్ గత ఐదు నెలలుగా ఫెడరల్ ఏజెన్సీ జారీ చేసిన ఐదు సమన్లను దాటవేశారు.
అంతకుముందు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తమ నోటీసులను లెక్కచేయడం లేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కోర్టుకు వెళ్లింది. ఈ మేరకు ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో ఫిర్యాదు చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్కు పలుమార్లు నోటీసులు పంపినా ఆయన పట్టించుకోవడం లేదని ఫిర్యాదులో పేర్కొంది.