Maharashtra : ప్రయాణికులకు బిగ్ షాక్.. , మహారాష్ట్రలో బస్సు ఛార్జీలు పెంపు

Update: 2025-01-26 07:15 GMT

మహారాష్ట్రలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరిగాయి. టికెట్ ధరపై 14.95% పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త రేట్లు ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చాయి. అటు ఆటో, ట్యాక్సీ ఛార్జీల పెంపు ప్రతిపాదనకు కూడా ముంబై మెట్రోపాలిటన్ రీజన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ ఆమోదం తెలిపింది. దీంతో ఆటో ఛార్జీ రూ.23 నుంచి రూ.26కి, టాక్సీ ఛార్జీ రూ.28 నుంచి రూ.31కి చేరింది. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం కూడా ఆర్టీసీ ఛార్జీలను పెంచింది.

కాగా, ఆటోలు, క్యాబ్స్‌ బేస్‌ ఛార్జీలు కూడా రూ.3కు పెంచారు. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (ఎంఎంఆర్టీఏ) దీనిని ఆమోదించింది. దీంతో ఆటో బేస్‌ రేట్లు రూ.23 నుంచి రూ.26కు, టాక్సీ బేస్ ఛార్జీలు రూ.28 నుంచి రూ.31కు పెరిగాయి. అలాగే బ్లూ అండ్ సిల్వర్ ఏసీ కూల్ క్యాబ్‌ ఛార్జీలను కూడా రూ.8కు పెంచారు.

దీంతో తొలి 1.5 కిలోమీటర్ల వరకు ప్రస్తుతం రూ.40 ఉండగా కొత్త ఛార్జీ మేరకు రూ.48కు పెరిగింది. మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ దేశంలోని అతిపెద్ద పబ్లిక్ ట్రాన్స్‌పోర్టర్‌లలో ఒకటి, సుమారు 15,000 బస్సులను నడుపుతోంది మరియు ప్రతిరోజూ 55 లక్షల మంది ప్రయాణికులను రవాణా చేస్తోంది. కాగా ఇటీవల కర్ణాటక ప్రభుత్వం కూడా ఆర్టీసీ ఛార్జీలను పెంచిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News