త్రిపురలోని ఉనకోటి జిల్లాలో భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి మార్చి 17న సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్) బంగ్లాదేశ్ (Bangladesh) చొరబాటుదారుని కాల్చి చంపినట్లు ఓ అధికారి తెలిపారు. సరిహద్దు అవతల నుండి దుండగులు దాడి చేయడంతో సైనికులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారని BSF ఒక ప్రకటనలో పేర్కొంది. మృతుడు బంగ్లాదేశ్లోని మౌల్విబజార్ జిల్లా దస్తాకి గ్రామానికి చెందిన సద్దాం హుస్సేన్ (23)గా గుర్తించారు.
కైలాషహర్లోని మాగ్రోలి సరిహద్దు ఔట్పోస్ట్ సమీపంలో BSF దళాలు విధులు నిర్వహిస్తున్నప్పుడు, 15-20 మంది పురుషులు అనుమానాస్పద వస్తువులను, బంగ్లాదేశ్ వైపు నుండి 25 నుండి 30 మంది దుర్మార్గులు వెదురు నిచ్చెనతో సరిహద్దు కంచె వద్దకు వస్తున్నట్లు గమనించారు. BSF జవాన్లు వారిని ఆపమని సవాలు చేశారు, కానీ వారు హెచ్చరికలను పట్టించుకోలేదు. అంతలోనే డ్యూటీలో ఉన్న BSF సిబ్బందిని చుట్టుముట్టారు.
"BSF దళాలు వారిని ఆపమని సవాలు చేశాయి. కానీ వారు పట్టించుకోలేదు, వారు మరింత దూకుడును ప్రదర్శించారు. డ్యూటీలో ఉన్న BSF జవాన్ను చుట్టుముట్టారు. ప్రాణాలకు, ప్రభుత్వ ఆస్తులకు ఆసన్నమైన ప్రమాదం ఉందని గ్రహించిన BSF జవాన్ ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. అది స్మగ్లర్లలో ఒకరిని తాకింది. అతను పట్టుబడ్డాడు”అని అధికారి తెలిపారు.