Congress : సోనియా, రాహుల్ చార్జ్ షీట్ నేపథ్యంలో కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళనలు
నేషన్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్గాంధీపై ఛార్జీషీట్ వేయడాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలకు పిలుపు ఇచ్చింది. ఈడీ కార్యాలయాల ఎదుట నిరసన తెలుపనున్నారు. అన్ని రాష్ట్రాల్లోని కేంద్ర కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేయనున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే ఆస్తుల్ని స్వాధీనం చేసుకునే ప్రక్రియను ఈడీ ప్రారంభించింది.
అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ను స్వాధీనం చేసుకునే క్రమంలో భారీగా డబ్పులు చేతులు మారాయని ఈడీ అభియోగాలు మోపింది. సోనియా, రాహుల్ వాటాదారులుగా ఉన్న యంగ్ ఇండియన్ సంస్థ గతంలో కాంగ్రెస్ పార్టీ పత్రిక నేషనల్ హెరాల్డ్ ను నడిపించింది.ఈ కేసు దర్యాప్తులో ఈడీ కీలక ఆధారాలు సేకరించింది. ఇందులో అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఆస్తులకు సంబంధించిన 988 కోట్ల నేరం ద్వారా వచ్చిన ఆదాయాన్ని మనీ లాండరింగ్ చేసినట్లు ఆరోపణలు నిర్దారణ కావడంతో 2023లో అటాచ్మెంట్ మొదలైంది.