Congress : రాజ్యసభ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల

Update: 2024-02-14 12:02 GMT

ఫిబ్రవరి 27న జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 'గ్రాండ్ ఓల్డ్ పార్టీ' అజయ్ మాకెన్, డాక్టర్ సయ్యద్ నసీర్ హుస్సేన్, కర్ణాటక నుండి జిసి చంద్రశేఖర్, మధ్యప్రదేశ్ నుండి అశోక్ సింగ్, తెలంగాణ నుండి ఎం అనిల్ కుమార్ యాదవ్‌, రేణుకా చౌదరిలను బరిలోకి దింపింది. పలు నివేదికల ప్రకారం రాజ్యసభకు వెళ్లాలనుకుంటున్న సీనియర్ పార్టీ నాయకుడు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ పేరు కాంగ్రెస్ జాబితాలో లేకపోవడం గమనార్హం.

కమల్ నాథ్ రాజ్యసభకు మారాలని కోరుకున్నారని, తన డిమాండ్ కోసం ఒత్తిడి చేయడానికి సోనియా గాంధీని కూడా కలిశారని వర్గాలు ముందుగా తెలిపాయి. ఇక 15 రాష్ట్రాల్లోని 56 రాజ్యసభ స్థానాలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనుండగా, నామినేషన్ల దాఖలుకు ఫిబ్రవరి 15 చివరి తేదీ.

Tags:    

Similar News