VIJAY: విజయ్ ప్రచార సభలో మృత్యు మృదంగం

తమిళనాట తీవ్ర విషాదం మిగిల్చిన ప్రచారసభ.. టీవీకే పార్టీ ప్రచారానికి పోటెత్తిన జన సందోహం.. తొక్కిసలాటలో సహా 38 మంది మృతి.. మృతుల్లో 8 మంది చిన్నారులు, 16 మంది మహిళలు

Update: 2025-09-28 01:30 GMT

తమిళనాడులో ఘోరం చోటు చేసుకుంది. టీవీకే చీఫ్ దళపతి విజయ్ నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటివరకు 38 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఇంకా చాలా మందికి గాయాలైనట్లు తెలిపారు. వచ్చే ఏడాది తమిళనాడులో జరగనున్న శాసనసభ ఎన్నికలకు సిద్ధమవుతున్న విజయ్‌ ఈ నెల 13న రాష్ట్రవ్యాప్త ప్రచారయాత్రను ప్రారంభించారు. శనివారాల్లో మాత్రమే రెండేసి జిల్లాల్లో ప్రచారం చేస్తున్నారు. ఈ శనివారం నామక్కల్‌లో ఉదయం ప్రచారం చేపట్టి సాయంత్రం కరూర్‌ చేరుకున్నారు. అక్కడి వేలుసామిపురంలో రాత్రి 7.30 గంటలకు విజయ్‌ ప్రసంగిస్తుండగా ఆయనకు సమీపంగా వచ్చేందుకు పలువురు ప్రయత్నించారు. దీంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. పిల్లలు, మహిళలు, వృద్ధులు అందులో చిక్కుకున్నారు. ఒకరి తర్వాత ఒకరు స్పృహతప్పి పడిపోవడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. ఉద్రిక్తత చోటుచేసుకుంది. 8 మంది చిన్నారులు, 16 మంది మహిళలు సహా 38 మంది మరణించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పరిస్థితిని అంచనా వేసిన విజయ్‌ తన ప్రసంగాన్ని నిలిపివేసి తోసుకోవద్దంటూ వారించే ప్రయత్నం చేశారు. అప్పటికే పరిస్థితి చేయి దాటిపోవడంతో సహాయక చర్యలకు ఆదేశించారు. సమీపాన ఉన్న అంబులెన్స్‌ వద్దకు బాధితులను తీసుకెళ్లడానికి కార్యకర్తలు ప్రయత్నించినా రద్దీ మధ్యలో నుంచి వెళ్లడానికి వెంటనే సాధ్యపడలేదు. బాధితులను పైకెత్తిపట్టుకుని రద్దీలో అతికష్టంపై ముందుకు సాగారు.

అంబులెన్స్‌ల్లో సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. ఘటనాస్థలికి మరికొన్ని అంబులెన్సులు రావడంతో వాటి ద్వారానూ బాధితులను తీసుకెళ్లారు. అయినప్పటికీ నిమిషాల వ్యవధిలో 38 ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. 50 మందికి పైగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో 20 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కరూర్‌లోని ఆసుపత్రుల వద్ద మృతుల బంధువుల రోదనలు మిన్నంటాయి. ఈ ఘట­న­పై రా­ష్ట్ర­ప­తి ద్రౌ­ప­ది ము­ర్ము, ప్ర­ధా­న­మం­త్రి నరేం­ద్ర మోదీ, కేం­ద్ర హోం­మం­త్రి అమి­త్ షా తీ­వ్ర ది­గ్భ్రాం­తి వ్య­క్తం చే­శా­రు. మరో­వై­పు.. సహా­యక చర్య­లు ము­మ్మ­రం చే­యా­ల­ని ఆదే­శా­లు జారీ చే­సిన తమి­ళ­నా­డు ము­ఖ్య­మం­త్రి ఎంకే స్టా­లి­న్.. నేడు అక్కడ పర్య­టిం­చ­ను­న్నా­రు. మృ­తుల కు­టుం­బా­ల­కు రూ. 10 లక్షల పరి­హా­రం ప్ర­క­టిం­చా­రు. క్ష­త­గా­త్రు­ల­కు రూ.లక్ష పరి­హా­రం ప్ర­క­టిం­చా­రు. హై­కో­ర్టు రి­టై­ర్ట్ జడ్జీ జస్టి­స్​ అరుణ జగ­దీ­శ­న్​ ఆధ్వ­ర్యం­లో ఏక సభ్య కమి­టీ ఏర్పా­టు చేసి దర్యా­ప్తు చే­ప­ట్టా­ల­ని ఆదే­శా­లు ఇచ్చి­న­ట్లు తె­లి­పా­రు. కొ­న్ని నెలల క్రి­తం.. మధు­రై­లో ని­ర్వ­హిం­చిన తొలి సభ­లో­నే తొ­క్కి­స­లాట చోటు చే­సు­కుం­ది.

Tags:    

Similar News