Odisha : ఇంజెక్షన్ చేసిన కొద్దిసేపటికే ఐదుగురు రోగులు చనిపోయారు

Update: 2025-06-05 06:45 GMT

ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో దారుణం జరిగింది. చికిత్స పొందుతున్న రోగులకు నర్సు తప్పుగా ఇచ్చిన ఇంజెక్షన్ల కారణంగా ఐదుగురు చనిపోయారు. సాహిద్ లక్ష్మణ్ నాయక్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో నిన్న అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. రోగుల బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... ఆస్పత్రిలోని ఐసీయూ, జనరల్ వార్డుల్లో చికిత్స పొందుతున్న పేషెంట్లలో ఐదుగురు నిన్న రాత్రి కొన్ని నిమిషాల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయారు. వారికి రెండో రౌండ్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఇలా జరిగిందని మృతుల కుటుంబీకులు చెప్పారు. నర్సు ఇంజెక్షన్ చేసిన క్షణాల్లోనే తీవ్రనొప్పితో కేకలు వేస్తూ వారు చనిపోయినట్లు తెలిపారు. చనిపోయిన వారంతా గతంలో అక్కడే శస్త్రచికిత్స చేయించుకున్నారని, ఆపరేషన్ అనంతరం వారి ఆరోగ్యం మెరుగ్గానే ఉందని అని మృతుల కుటుంబసభ్యులు పేర్కొన్నారు. అయితే, ఇంజెక్షన్ ఇవ్వగానే వారి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించిందని తెలిపారు. ఈ ఘటనపై ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వహించారంటూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆస్పత్రికి చేరుకొని పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మరణానికి గల అసలు కారణాలు స్పష్టమవుతాయని పోలీసులు తెలిపారు. అయితే, ఇప్పటి వరకు ఆసుపత్రి యాజమాన్యం ఈ విషయమై ఎలాంటి వివరణ ఇవ్వలేదు.

Tags:    

Similar News