ఒడిశా తొలి బీజేపీ సీఎంగా ఎన్నికైన మోహన్ చరణ్ మాఝీ ( CM Mohan Charan Majhi ) తన రాజకీయ ప్రస్థానాన్ని సర్పంచ్ స్థాయి నుంచి ప్రారంభించారు. వాచ్మెన్ కొడుకైన మోహన్ 1997-2000 మధ్య కాలంలో ఆదివాసీ ప్రాంతమైనా రాయికల గ్రామ సర్పంచ్గా చేశారు. ఆ తర్వాత 2000లో కియోంజర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచారు. 2004, 19, 24లోనూ అదే స్థానం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఒడిశాలో గిరిధర్ గమాంగ్, హేమానంద బిస్వాల్ తర్వాత మూడో ఆదివాసీ సీఎంగా నిలవనున్నారు.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మోహన్కు ఏకంగా 47.05 శాతం ఓట్లు రావడం గమనార్హం. మోహన్ ప్రజాసేవతో మంచి గుర్తింపు పొందారు. ఫైర్ బ్రాండ్గానూ పేరొందారు. గత ఏడాది నిరసనలో భాగంగా అసెంబ్లీలో స్పీకర్ పోడియంవైపు పప్పు విసిరి సస్పెన్షన్కు గురవ్వడంతో మోహన్ పేరు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఇక కేవీ సింగ్ డియో బోలంగీర్ నియోగజకవర్గం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా,బీజేపీ-బిజూ జనతాదళ్ కూటమి 2009 వరకు నవీన్ పట్నాయక్ ప్రభుత్వంలో తొమ్మిదేళ్లపాటు మంత్రిగా పనిచేశారు.