దేశంలో జీఎస్జీటీ వసూళ్లు మే నెలలో 16.4 శాతం పెరిగి 2.01 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2024 మే నెలలో 1.72 లక్షల కోట్లు వచ్చాయి. ఈ సంవత్సరం ఏప్రిల్లో రికార్డు స్థాయిలో 2.37 లక్షల కోట్లు వసూలయ్యాయి. ఈ వివరాలను ఆదివారం నాడు ఆర్ధిక శాఖ విడుదల చేసింది. వార్షిక ప్రాతిపదికన దిగుమతులపై జీఎస్టీ వసూళ్లు 25.2 శాతం పెరిగాయి. దేశీయ లావాదేవీలపై వసూళ్లు 13.7 శాతం పెరిగాయి. దిగుమతులపై స్థూల జీఎస్టి ఆదాయం 51,266 కోట్లు, దేశీయ వసూళ్ల ద్వారా ఆదాయం 1,49,785 కోట్లు వచ్చాయి. స్థూల జీఎస్ఓ ఆదాయం 14.3 శాతం పెరిగి 4.37 లక్షల కోట్లుగా ఉంది. రిఫండ్స్ తరువాత నికర జీ ఎస్టీ ఆదాయం 1,73,841 కోట్లుగా ఉంది. మే నెలలో 27,210 కోట్ల రూపాయల రిఫండ్స్ ఇచ్చారు. బడ్జెట్లో జీఎస్టి ఆదాయం 11 శాతం పెరిగి 11.78 లక్షల కోట్లు వస్తాయని అంచనా వేశారు.