గత ఆర్ధిక సంవత్సరంలో ఒక్క ఆరోగ్య బీమా ప్రీమియంలపైనే వస్తు, సేవల పన్ను రూపేణా రూ.8,263 కోట్లు వసూలు య్యాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. దీనిని తొలగించాలని పలు విజ్ఞప్తులు వచ్చాయని, జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై ప్రస్తుతం 18 శాతం చొప్పున జీఎస్టీ వసూలు చేస్తున్నామని వివరించారు.
ఇటీవల ఆరోగ్య బీమా, జీవిత బీమా పాలసీలపై జీఎస్టీని తొలగించాలని కేంద్రమంత్రి గడ్కరీ... ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాయడం సంచలనం రేపింది. అలాగే తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి చౌదరి ఈ వివరాలను వెల్లడించారు. పేదలు, దివ్యాంగుల కోసం ఉద్దేశించిన రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన, యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్, జన ఆరోగ్య బీమా పాలసీ, నిర్మయ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ వంటి కొన్ని రకాల బీమా పాలసీ ప్రీమియంలను జీఎస్టీ నుంచి మినహాయించాంమని తెలిపారు.
2023– 24 ఆర్థిక సంవత్సరంలో రూ.8,262.94 కోట్లు, 2022-23 ఆర్థిక సంవత్సరంలో ర.7,638 కోట్లు, 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ. 5,354 కోట్లు వచ్చాయి అని వివరించారు. జీఎస్టీ తొలగింపుపై కేంద్రం, రాష్ట్రాలతో కూడిన జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.