INDIA: అంతరిక్షంలో భారత్ నిఘా నేత్రం

52 మిలిటరీ ఉపగ్రహాల ప్రయోగం వేగవంతం.. ఇక అంతరిక్షం నుంచి సైనిక ఆపరేషన్లు;

Update: 2025-07-01 03:00 GMT

'ఆ­ప­రే­ష­న్‌ సిం­దూ­ర్‌' తర్వాత భా­ర­త్‌ అం­త­రి­క్షం­లో నిఘా సా­మ­ర్థ్యా­న్ని మరింత స్థా­యి­కి చే­ర్చేం­దు­కు కీలక చర్య­లు ప్రా­రం­భిం­చిం­ది. ము­ఖ్యం­గా చైనా, పా­కి­స్థా­న్‌, హిం­దూ మహా­స­ము­ద్ర పరి­సర ప్రాం­తా­ల­పై నిఘా కొ­న­సా­గిం­చేం­దు­కు 52 సై­నిక ఉప­గ్ర­హా­ల­ను ఆవి­ష్క­రిం­చా­ల­నే లక్ష్యం­తో ముం­దు­కె­ళ్తోం­ది. ఈ ప్రా­జె­క్టు­లో భా­గం­గా రి­య­ల్‌­టై­మ్‌ మా­ని­ట­రిం­గ్‌ వంటి అత్య­వ­సర అవ­స­రాల కోసం కేం­ద్ర ప్ర­భు­త్వం రూ.26,968 కో­ట్లు ఖర్చు చే­య­నుం­ది. చైనా అం­త­రి­క్ష రం­గం­లో వే­గం­గా పు­రో­గ­మి­స్తూ ఆధి­ప­త్యా­న్ని సా­ధిం­చేం­దు­కు ప్ర­య­త్ని­స్తు­న్న తరు­ణం­లో, భారత ప్ర­భు­త్వం దీ­న్ని సమ­ర్థ­వం­తం­గా ఎదు­ర్కొ­నే వ్యూ­హా­న్ని తయా­రు చే­స్తోం­ది.

భవిష్యత్తు రక్షణ అవసరాల దృష్ట్యా...

ఉప­గ్రహ ని­ఘా­తో పాటు ఆప­రే­ష­న్ సమ­యం­లో కచ్చి­త­మైన మ్యా­పిం­గ్ చే­య­డం­లో భారత శా­టి­లై­ట్లు కీలక పా­త్ర పో­షిం­చా­యి. ఈ పరి­స్థి­తు­ల్లో భా­ర­త్ భవి­ష్య­త్తు రక్షణ అవ­స­రా­ల­ను దృ­ష్టి­లో పె­ట్టు­కు­ని మరో 52 డి­ఫె­న్స్ శా­టి­లై­ట్ల­ను సి­ద్ధం చే­స్తోం­ది. ఈ కా­ర్య­క్ర­మం ఇప్పు­డు ఊపం­దు­కుం­ది. అలా­గే సమ­గ్ర­మైన ‘సై­నిక అం­త­రి­క్ష సి­ద్ధాం­తం’ కూడా చి­వ­రి దశలో ఉంది. ‘స్పే­స్ బే­స్డ్ సర్వై­లె­న్స్’ (SBS) కా­ర్య­క్ర­మం మూడవ దశను ప్ర­ధా­న­మం­త్రి నే­తృ­త్వం­లో­ని భద్ర­తా వ్య­వ­హా­రాల క్యా­బి­నె­ట్ కమి­టీ గత సం­వ­త్స­రం అక్టో­బ­ర్‌­లో ఆమో­దిం­చిం­ది. ఇం­దు­లో మొ­త్తం 52 ఉప­గ్ర­హా­ల­ను రూ. 26,968 కో­ట్ల వ్య­యం­తో తయా­రు చేసి ప్ర­యో­గిం­చా­ల­ని ని­ర్ణ­యిం­చా­రు. వీ­టి­లో 21 ఉప­గ్ర­హా­ల­ను ఇస్రో తయా­రు చే­య­గా, 31 ఉప­గ్ర­హాల తయా­రీ పని­ని మూడు ప్రై­వే­ట్ కం­పె­నీ­ల­కు అప్ప­గిం­చా­రు. ఈ రక్షణ చర్యలు భవిష్యత్తులో భారత్ కు ఉపయోగపడనున్నాయి.

2026 నాటి మొదటి శాటిలైట్

మొ­ద­టి ఉప­గ్ర­హం ఏప్రి­ల్ 2026 నా­టి­కి ప్ర­యో­గిం­చే­లా ప్ర­ణా­ళి­క­లు సి­ద్ధం చే­శా­రు. 2029 చి­వ­రి నా­టి­కి మొ­త్తం 52 ఉప­గ్ర­హా­ల­న్నీ అం­త­రి­క్షం­లో­కి చే­రు­కుం­టా­యి. ఈ ప్రా­జె­క్ట్ రక్షణ మం­త్రి­త్వ శా­ఖ­కు చెం­దిన ఇం­టి­గ్రే­టె­డ్ డి­ఫె­న్స్ స్టా­ఫ్ (IDS) ఆధ్వ­ర్యం­లో­ని డి­ఫె­న్స్ స్పే­స్ ఏజె­న్సీ (DSA) పర్య­వే­క్ష­ణ­లో పూ­ర్త­వు­తుం­ది. స్పే­స్‌ బే­స్‌ సర్వై­లె­న్స్‌ ఎస్‌­బీ­ఎ­స్‌ మూ­డో­వి­డత కా­ర్య­క్ర­మం­లో భా­గం­గా.. ఇస్రో 21 ఉప­గ్ర­హా­ల­ను ప్ర­యో­గిం­చ­నుం­ది. మి­గి­లిన 31 శా­టి­లై­ట్స్‌­ను మూడు ప్రై­వే­టు­సం­స్థ­లు అభి­వృ­ద్ధి చేసి కక్ష్య­లో­కి చే­ర్చ­ను­న్నా­యి. ఈ కా­ర్య­క్ర­మం­లో భా­గం­గా తొలి ఉప­గ్ర­హా­న్ని ఏప్రి­ల్‌ 2026న కక్ష్య­లో ప్ర­వే­శ­పె­ట్ట­ను­న్నా­రు. 2029 చి­వ­రి­కి మొ­త్తా­న్ని అం­త­రి­క్షం­లో­కి చే­ర్చ­ను­న్నా­రు. ఇస్రో స్మా­ల్‌ శా­టి­లై­ట్‌ లాం­చ్‌ వె­హి­క­ల్‌ టె­క్నా­ల­జీ­ని ప్రై­వే­టు సం­స్థ­ల­కు బద­లా­యిం­చి.. వా­టి­కి ఈ ప్రా­జె­క్టు­లో కీలక భా­గ­స్వా­మ్యం ఇవ్వ­నుం­ది. అత్య­వ­సర సమ­యా­ల్లో వే­గం­గా ఉప­గ్ర­హా­ల­ను ప్ర­యో­గిం­చ­డా­ని­కి ఇది ఉప­యో­గ­ప­డ­నుం­ది. లో­ఎ­ర్త్‌, జియో స్టే­ష­న­రీ కక్ష్య­ల­పై దృ­ష్టి­పె­ట్టే ఈ ప్రా­జె­క్టు­ను ఇం­టి­గ్రే­టె­డ్‌ డి­ఫె­న్స్‌ స్టా­ఫ్‌ పర్య­వే­క్షిం­చ­ను­న్నా­రు. చైనా యాం­టీ శా­టి­లై­ట్‌ సా­మ­ర్థ్యా­ని­కి కౌం­ట­ర్‌­గా కూడా ఈ ప్రా­జె­క్టు ఉప­యో­గ­ప­డ­నుం­ది.

దూకుడుగా చైనా

చైనా అంతరిక్షంలో తన బలాన్ని నిరంతరం పెంచుకుంటోంది. 2010లో కేవలం 36 ఉపగ్రహాలతో ప్రారంభమైన చైనా సైనిక అంతరిక్ష కార్యక్రమం 2024 నాటికి 1,000 కంటే ఎక్కువ ఉపగ్రహాలను చేరుకుంది. వీటిలో 360 ఉపగ్రహాలు ప్రత్యక్ష నిఘాతో పాటు నిఘా కార్యకలాపాల కోసం నిరంతరం పనిచేస్తున్నాయి. గత సంవత్సరం PLA ఏరోస్పేస్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయడం ద్వారా ఆధునిక యుద్ధంలో అంతరిక్షాన్ని ‘అంతిమ హై గ్రౌండ్’గా పరిగణిస్తున్నట్లు చైనా స్పష్టం చేసింది.

Tags:    

Similar News