WAR: పాకిస్థాన్‌కు కాళరాత్రి

అనధికార యుద్ధం ప్రారంభం... దాయాది దాడులను తిప్పికొట్టిన భారత సైన్యం;

Update: 2025-05-09 02:30 GMT

పాకిస్థాన్‌ కయ్యానికి కాలుదువ్వింది. సమరానికే సిద్ధమంది. మన సైనిక స్థావరాలు, పౌర ఆవాసాలపై దాయాది గురి పెట్టింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారత్‌లోని సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడికి విఫల యత్నం చేసింది. ఆ దాడులను మన ‘సుదర్శన చక్రం’ ఎస్‌-400 ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ తుత్తునియలు చేసింది. పాక్ దాడులను భారత్ సమర్థంగా అడ్డుకుంది. పాకిస్థాన్ నడిబొడ్డుపై దాడులు చేసింది. రాజధాని ఇస్లామాబాద్‌పై దాడి చేసింది. ఇండియన్ ఆర్మీ దెబ్బతో పాక్ ప్రధాని బంకర్లో దాక్కోవాల్సి వచ్చింది. భారత నేవీ ధాటికి కరాచీ పోర్టు ధ్వంసమైంది. భారత్ వరుస దాడులతో పాక్‌కు కాళరాత్రి మిగిలింది

పాక్ డ్రోన్లు చిత్తు

జమ్మూ నగరంపైకి పాకిస్థాన్‌ ప్రయోగించిన డ్రోన్లు ఉగ్రమూకలను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌ దుస్సాహసానికి ఒడిగట్టింది. రెచ్చగొట్టే ధోరణిని మళ్లీ ప్రదర్శించింది. గురువారం రాత్రి క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లు, యుద్ధ విమానాలను మన దేశంపైకి ప్రయోగించింది. సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కశ్మీర్, రాజస్థాన్, పంజాబ్‌లపైకి వాటిని వదిలింది. జమ్మూ విమానాశ్రయంతోపాటు సరిహద్దుల్లోని పలు సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది. 35 నిమిషాలపాటు సాగిన ఈ ప్రయత్నాలను భారత్‌ సమర్థంగా తిప్పికొట్టింది. 8 డ్రోన్లను, 3 ఫైటర్‌ జెట్లను కూల్చేసింది. పాక్‌ పైలట్‌ను భారత సైన్యం బందీగా పట్టుకుంది.

పాకిస్థాన్‌కు చావు దెబ్బ

లాహోర్‌ సహా పాకిస్థాన్‌కు చెందిన తొమ్మిది ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలపై భారత్‌ భీకర దాడులు చేసింది. పాకిస్థాన్‌ కురిపించిన డ్రోన్లు, రాకెట్ల వర్షాన్ని... భారత్‌ గాల్లోనే అడ్డుకుని ధ్వంసం చేస్తోంది. సరిహద్దు గ్రామాల్లో ఇప్పుడు యుద్ధ వాతావరణం నెలకొంది. అటు క్వెట్టాను బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ స్వాధీనం చేసుకుంది. దాంతో, అక్కడి నుంచి పాక్‌ ఆర్మీ పలాయనం చిత్తగిస్తోంది. ఆ వెంటనే.. కరాచీ పోర్టుపై భారత నావికా దళం భీకర దాడి చేసింది. అరేబియా సముద్రంలో ఉన్న ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ గ్రూపు నుంచి బ్రహ్మోస్‌ క్షిపణుల వర్షం కురిపించింది. ఇరు దేశాల మధ్య ఇక.. సమరం ఆరంభమైంది.

Tags:    

Similar News