జాతీయ మానవహక్కుల కమిషన్(NHRC) ఛైర్మన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రామసుబ్రమణియన్ బాధ్యతలు చేపట్టారు. ఈయన ఐదేళ్లపాటు లేదా వయసు 70ఏళ్ల వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు. మద్రాస్ లా కాలేజీలో చదివిన ఈయన 1983 నుంచి 23 ఏళ్ల పాటు లాయర్గా ప్రాక్టీస్ చేశారు. ఆ తర్వాత మద్రాస్, ఉమ్మడి ఏపీ హైకోర్టు న్యాయమూర్తి, హిమాచల్ ప్రదేశ్ CJగా బాధ్యతలు నిర్వహించారు. 2019-23 మధ్య సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేశారు. మరోపక్క, ఎన్హెచ్ఆర్సీ సభ్యుడిగా నియమితులైన ప్రియాంక్ కనూంగో గతంలో జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ ఛైర్పర్సన్గా వ్యవహరించారు. ఈయన స్వరాష్ట్రం మధ్యప్రదేశ్. మరో సభ్యుడు జస్టిస్ బిద్యుత్రంజన్ షడంగి స్వరాష్ట్రం ఒడిశా. ఈ ఏడాది జులై 5 నుంచి 19 వరకు ఝార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. అంతకుముందు ఒడిశా హైకోర్టు