ప్రసిద్ధ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాస న్ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనతో పాటు నామినేషన్ వేసిన మిగతా నలుగురు డీఎంకే అభ్యర్థులు ఎలాంటి పోటీ లేకుండా రాజ్యసభకు ఎన్నికయ్యారు. డీఎంకే అభ్యర్థులు ముగ్గురు, అన్నాడీఎంకే అభ్యర్థులు ఇద్దరు పోటీ చేశా రు. మిత్రపక్షమైన ఎంఎన్ఎంకు ఒక సీటును డీఎంకే కేటాయించింది. వీరి నామి నేషన్లు సవ్యంగా ఉన్నట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించడంతో వీరంతా ఏకగ్రీవమ య్యేందుకు మార్గం సుగమం అయింది. మక్కల్ నీది మయ్యం వ్యవస్థాపకుడు కమల్ హాసన్, డీఏంకే సిట్టింగ్ ఎంపీ పీ విల్సన్, పార్టీ అభ్యర్థులు రాజాతి, ఎస్.ఆర్. శివలింగం, అన్నాడీఎంకేకు చెందిన ఐ. ఎస్. ఇన్బాదురై, ఎం. ధనపాల్ నామినేషన్ పత్రాలు సరిగ్గా ఉన్నట్లు తేలింది. మరో ఏడుగురి నామినేషన్ పత్రాలు చెల్లవని ప్రకటించారు. కాగా, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ జూన్ 12. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థుల ఉపసంహరణలు జరగకపోతే.. ఆరుగురు అభ్యర్థులను విజేతలుగా ప్రకటిస్తారు.