Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌‌లో వరదలు.. కూలిన రైల్వే బ్రిడ్జ్..

Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌ను వరదలు ముంచెత్తుతున్నాయి.

Update: 2022-08-20 10:06 GMT

Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌ను వరదలు ముంచెత్తుతున్నాయి. నదులు పొంగి ప్రవహించడంతో పాటు మనుషుల ప్రాణాలకు హానికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా నదుల పరివాహక ప్రాంతాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు. కాంగ్రా, చంబ్ర, బిలాస్ పూర్, సిర్మౌర్, మండి జిల్లాల్లో వరద ఉగ్రరూపం దాల్చింది.

వరద తీవ్రతకు కాంగ్రా జిల్లాలోని చక్రి నదిపై ఉన్న రైల్వే బ్రిడ్జ్ కుప్పకూలిపోయింది. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలను కలిపే బ్రిడ్జ్ ఇది. ఇక కాంగ్రా జిల్లాలోని బల్హ్, సాదర్, తునంగ్, మండి, లమతచ్ ప్రాంతాలకు రాకపోకలు అనేవి అసాధ్యంగా మారిపోయాయి. అంతే కాకుండా మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రజలను హెచ్చరించింది. నిత్యం ఏడు రైళ్లు ప్రయాణించే ఈ బ్రిడ్జ్ కూలిపోవడంతో పలు రైలు సర్వీసులు తాత్కాలికంగా నిలిచిపోయాయి.

Tags:    

Similar News