ఓటుకు నోటు కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ మరో బెంచ్కు బదిలీ కానుంది. ఈ కేసును విచారిస్తున్న జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ.. గతంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినందుకు ఆయన ఈ విచారణ నుండి వైదొలిగారు, దీంతో ఈ కోర్టును మరో ధర్మాసనానికి బదిలీ చేయనుంది సుప్రీంకోర్టు.