మహాకుంభమేళాను సక్సెస్ గా నిర్వహించామన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. కుంభమేళాపై లోక్ సభలో ప్రకటన చేశారు. బాలరాముని ప్రతిష్ఠ జరిగిన ఏడాదికే ఉత్తరప్రదేశ్ లో మహాకుంభమేళా జరిగిందన్నారు ప్రధాని. దేశ ఐక్యతను కుంభమేళా ద్వారా ప్రపంచానికి చాటిచెప్పామన్నారు. మహా కుంభ మేళా చారిత్ర ఘట్టమని.. తాను మారిషన్ వెళ్లినప్పుడు కుంభమేళా నీళ్లను తీసుకెళ్లానన్నానని తెలిపారు. ప్రయాగ్ రాజ్ లో 66 కోట్ల మంది స్నానాలు చేశారని.. కుంభ మేళా విజయంతంతం కావడానికి అందరూ సహకరించారన్నారు, ఇది భవిష్యత్తు తరాలకు ఉదాహరణగా నిలుస్తుందని తెలిపారు ప్రధాని.