Rahul Gandhi : రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయం : మహేశ్ కుమార్ గౌడ్

Update: 2024-09-16 12:30 GMT

సూర్యాపేట జిల్లాలో పర్యటించిన అనంతరం టీపీసీసీ చీఫ్‌గా మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. మహేశ్ కుమార్ గౌడ్ నేతృత్వంలో పార్టీ బలోపేతం అవుతుందనే నమ్మకం తమకు ఉందని తెలిపారు. పార్టీలో సుదీర్ఘంగా పని చేస్తున్న వ్యక్తికి పదవి ఇవ్వడం సంతోషంగా ఉందని అన్నారు.ఇతర పార్టీల్లో ఒకే సామాజిక వర్గానికి అధ్యక్ష పదవి ఉంటుంది. కానీ కాంగ్రెస్‌లోనే ఎవరికైనా పార్టీ బాధ్యతలు ఇస్తుందని తెలిపారు. కార్యకర్తల త్యాగాలతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మంత్రి అన్నారు. దేశంలో ప్రధాని మోడీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని, వచ్చేసారి అధికారం కోల్పోవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు జరిగితే అప్పుడు రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 17వ తేదీకి బీజేపీకి ఏం సంబంధం లేదని, తెలంగాణ ఏర్పాటులో బీజేపీ పాత్ర శూన్యమని మంత్రి ఉత్తమ్ విమర్శించారు.

Tags:    

Similar News