ఛత్తీస్గడ్ బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. 12మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. దక్షిణ బస్తర్ ప్రాంత అడవుల్లో భీకర కాల్పులు కొనసాగుతున్నాయి. మరోవైపు ఎన్కౌంటర్ని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ధృవీకరించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. తెలంగాణకు చెందిన కీలక మావో నేతలు మృతిచెందినట్టు సమాచారం. నెలరోజుల్లో ఐదోసారి ఎదురుకాల్పులు జరగడం ఉద్రిక్తతలు పెంచుతోంది.