రాజకీయాల్లో ఎప్పుడు నిప్పు, ఉప్పులా ఉండే నాయకులు ఎదురుపడి నవ్వుకుంటే ఆ ఫ్రేమ్ ఆసక్తికరంగా ఉంటుంది. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మహాపరినిర్వాణ్ దివస్ సందర్భంగా భారత ప్రధాని మోడీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇద్దరూ షేక్ హ్యాండ్ చేసుకొని కాసేపు నవ్వుతూ మాట్లాడుకున్నారు. దీంతో కెమెరాలన్నీ వారినే ఫోకస్ చేశాయి. ఒకే ఫ్రేంలో వీరిద్దరితో పాటు మాజీ ప్రెసిడెంట్ రామ్ నాథ్ కోవింద్ సైతం నవ్వుతూ కనిపించారు. దీనికి ఉపరాష్ట్రపతి జర్దీప్ ధన్ ఖర్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా హాజరయ్యారు.