Maharashtra: ముంబై-పుణె హైవేపై గ్యాస్ ట్యాంకర్ బోల్తా.. 40 గంటలు నిలిచిన ట్రాఫిక్..
నరకయాతన అనుభవించిన మహిళలు, పిల్లలు
మహారాష్ట్రలోని ముంబై-పూణె జాతీయ రహదారిపై ట్యాంకర్ బోల్తా పడింది. దీంతో భారీగా ఇరు వైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దాదాపు 40 గంటలకు వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయిు. అటు ముందుకు వెళ్లలేక.. ఇటు వెనక్కి వెళ్లలేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక వాహనాల్లో ఉన్న ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. తాగేందుకు నీళ్లు లేక.. ఆహారం లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ గోడును వెళ్లబుచ్చుతున్నారు. అధికారులు పట్టించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పిల్లలు, మహిళలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇందుకు సంబంధించిన డ్రోన్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఒక వాహనదారుడు మాట్లాడుతూ… ‘‘మేము మధ్యాహ్నం పుణె నుంచి ప్రయాణాన్ని ప్రారంభించామని..పోలీసుల నుంచి మాకు ఎలాంటి సమాచారం లేదు అన్నారు. టోల్ వసూలు చేసి మమ్మల్ని ముందుకు పంపేసి ఇరుక్కుపోయేలా చేశారు. కనీసం అధికారులు సమాచారం తెలియజేయాలి కదా?. ట్రాఫిక్ను క్లియర్ చేయడానికి ఒక్క పోలీస్ కూడా లేరు’’. అంటూ వాపోయాడు.
ప్రస్తుతం గ్యాస్ ట్యాంకర్ను అధికారులు తొలగించారు. భారీ క్రేన్ల సహాయంతో తొలగించారు. ట్రాఫిక్ను నెమ్మది నెమ్మదిగా క్లియర్ చేస్తున్నారు. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో టోల్ వసూలు నిలిపివేశారు. ప్రస్తుతం వాహనాలు క్లియర్ చేస్తు్న్నారు.
మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముంబై వైపు వెళ్తున్న గ్యా్స్ ట్యాంకర్ బోల్తా పడింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వేలాది వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి. 20 కి.మీ మేరకు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మహిళలు, పిల్లలు అయితే నరకయాతన పడ్డారు. నీరు, ఆహారం లేక ఆకలితో అలమటించారు. ఇక టాయిలెట్కు వెళ్లలేక మహిళలకు చుక్కలు కనిపించాయి. గంటల తరబడి వాహనాల్లోనే బందీ అయిపోయారు. దీంతో అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ప్రస్తుతం 40 గంటల తర్వాత ట్రాఫిక్ క్లియర్ అయింది. ట్రాఫిక్ జామ్ కారణంగా కూరగాయాలు, నిత్యావసర వస్తువుల సరఫరా నిలిచిపోయింది.