Mukhtar Ansari : మా నాన్నకు 'స్లో పాయిజన్' ఇచ్చారు : ముఖ్తార్ అన్సారీ కొడుకు

Update: 2024-03-29 06:20 GMT

గ్యాంగ్‌స్టర్‌గా మారిన రాజకీయ నాయకుడు జైలులో "స్లో పాయిజనింగ్"కు గురయ్యాడని ముక్తార్ అన్సారీ కుమారుడు ఉమర్ అన్సారీ పేర్కొన్నాడు. 2005 నుంచి జైలులో ఉన్న అన్సారీ మార్చి 28న ఉత్తరప్రదేశ్‌లోని బండాలోని ఓ ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించారు. "రెండు రోజుల క్రితం, నేను అతన్ని (ముక్తార్ అన్సారీ) కలవడానికి వెళ్లాను. కానీ నన్ను అనుమతించలేదు, అతనికి స్లో పాయిజన్ ఇస్తున్నట్లు మేము గతంలో, ఇప్పుడు కూడా చెప్తున్నాం. మార్చి 19 న, అతనికి జైలు అందించిన ఆహారంలో విషపూరిత పదార్ధం ఇచ్చారు. దీనిపై పూర్తి విశ్వాసం ఉన్నందున కోర్టును ఆశ్రయిస్తాం’’ అని ఆయన చెప్పారు.

గత వారం, ముఖ్తార్ అన్సారీ బారాబంకి కోర్టులో ఒక దరఖాస్తును సమర్పించాడు. తనకు ఆహారంతో పాటు కొంత "విష పదార్ధం" ఇస్తున్నట్లు చెప్పాడు. మార్చి 19న ఆహారం తిన్న తర్వాత తన నరాలు, అవయవాల్లో నొప్పులు ప్రారంభమయ్యాయని అన్సారీ పేర్కొన్నారు. "తర్వాత, నొప్పి మొత్తం శరీరానికి వ్యాపించింది. దరఖాస్తుదారు చనిపోతారని అనిపించింది. అతను దీనికి ముందు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడు" అని అన్సారీ తరపు న్యాయవాది దరఖాస్తులో పేర్కొన్నారు.

మౌ నుండి ఐదుసార్లు మాజీ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన 40 రోజుల క్రితం, తన ఆహారంలో కొంత విష పదార్ధం కలిపారని ఆరోపించారు. దీంతో ఫుడ్‌ను తయారు చేసిన జైలు సిబ్బంది స్వయంగా రుచి చూశారు. అన్సారీతో పాటు సిబ్బంది కూడా అనారోగ్యానికి గురయ్యారని దరఖాస్తులో పేర్కొన్నారు. బండా జైలులో తన ప్రాణాలకు ముప్పు ఉందని, మార్చి 19న తన ఆహారంలో విషం చిమ్మడం కుట్రలో భాగమని ముఖ్తార్ అన్సారీ ఆరోపించారు. ముఖ్తార్ అన్సారీ తరపు న్యాయవాది మాజీ ఎమ్మెల్యేకు మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి చికిత్స అందించాలని అభ్యర్థించారు.

Tags:    

Similar News