PM Modi : ఈనెల 21 నుంచి మోడీ అమెరికా పర్యటన

Update: 2024-09-18 11:45 GMT

ప్రధాని మోడీ అమెరికా పర్యటన ఖరారైంది. ఈనెల 21 నుంచి 23 వ తేదీ వరకు మూడు రోజులు అక్కడ పర్యటించనున్నారు. ఈ మేరకు ప్రధాని టూర్ గురించి విదేశాంగ శాఖ మంగళవారం అధికారిక ప్రకటన చేసింది. సెప్టెంబర్ 21న విల్మింగ్టన్ వేదికగా జరిగే నాలుగవ క్వాడ్ సదస్సుకు ప్రధాని వెళ్తారు.

వాస్తవానికి ఈ కార్యక్రమం భారత్ లోనే జరగాల్సి ఉంది. అయితే బైడెన్ పదవీకాలం చివరిదశ కావడంతో, అమెరికా అధినేత విజ్ఞప్తి మేరకు ఈ అవకాశం వారికి ఇవ్వడం జరిగింది. వచ్చే ఏడాది క్వాడ్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇస్తుంది. క్వాడ్ లో భారత్ తోపాటు అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ సభ్యదేశాలుగా ఉన్నాయి. ఈ పర్యటనలో భాగంగా సెప్టెంబర్ 22న న్యూయార్క్ ప్రవాస భారతీయులతో మోడీ సమావేశం అవుతారు.

ప్రముఖ కంపెనీల సీఈవోలను కలుస్తారు మోడీ. 23వ తేదీన ఐరాస జనరల్ అసెంబ్లీలో సమ్మిట్ ఆఫ్ ద ఫ్యూచర్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా వివిధ దేశాల అధినేతలతో ద్వైపాక్షిక సమావేశాలు జరుపుతారని విదేశాంగ శాఖ ప్రకటన తెలిపింది.

Tags:    

Similar News